Thursday, May 2, 2024

తెలంగాణ‌లో అన్ని కుల వృత్తులకు ప్రోత్సాహం : మంత్రి సత్యవతి

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్ని కుల వృత్తులను ప్రోత్సహిస్తూ వారి సంక్షేమానికి పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తుందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. బయ్యారం మండలం కోటగడ్డ గ్రామంలోని బయ్యారం పెద్ద చెరువులో జిల్లా కలెక్టర్ కె.శశాంకతో కలిసి ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి చెరువులో చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాల ద్వారా ఆదాయాన్ని మరింత పెంపొందించుకోవాలని అన్నారు. రాష్ట్రంలోని అన్ని చెరువులను మిషన్ కాకతీయ ద్వారా ఆధునీకరించుకోవడం వల్ల నేడు జలాశాయాలన్ని అలుగు పారుతున్నాయన్నారు. ఇదంతా సీఎం కేసీఆర్‌ వినూత్న ఆలోచనతో సాధ్యమైందన్నారు. పోడు భూములకు సంబంధించి ఏ ఒక్క రైతు నష్టపోకుండా న్యాయం చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement