Friday, May 17, 2024

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలతో ముగిశాయి. ఐరోపాలో తీవ్రమవుతున్న ఇంధన సంక్షోభం, ఐరోపా కేంద్ర బ్యాంక్‌ వడ్డీరేట్ల నిర్ణయం,అధిక ద్రవ్యోల్బణం కారణంగా ఆసియా మార్కెట్లు పతనమయ్యాయి. అయినప్పటికీ, దేశీయ స్టాక్‌ మార్కెట్‌లు ఈరోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉదయం 9.35గంటల సమయంలో సెన్సెక్స్‌ 335 పాయింట్ల లాభంతో   59138 వద్ద, నిఫ్టీ 89 పాయింట్ల లాభంతో 17629 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తుంది. ముగిసే సమయానికి సెన్సెక్స్ 442 పాయింట్లు లాభపడి..59,245 వద్ద ముగిశాయి. అలాగే నిఫ్టీ 126 పాయింట్లు పెరిగి 17,665 దగ్గర ముగిశాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement