Wednesday, May 1, 2024

దేశంలో జరుగుతున్న విధ్వంసానికి బీజేపే కారణం : హరీశ్ రావు

దేశంలో జరుగుతున్న విధ్వంసానికి బీజేపే కారణమని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు అన్నారు. నిజామాబాద్ జిల్లాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ… అగ్నిపథ్ తో ఆర్మీ ఉద్యోగాలకు బీజేపీ మంగళం పాడుతోందన్నారు. యువకుల బాధ బీజేపీ నేతలకు అర్థం కావడం లేదన్నారు. ఇక్కడ దాడుల వెనుక టీఆర్ఎస్ హస్తముంటే… యూపీలో ఎవరి హస్తముందని ప్రశ్నించారు. అగ్నిపథ్ వద్దన్న యువకులను కాల్చి చంపుతున్నారన్నారు. బండి సంజయ్, డీకే అరుణ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement