Wednesday, May 1, 2024

Sirikonda : విద్యుత్ఘాతంతో వృద్ధుడు మృతి

సిరికొండ, జులై 8 (ప్రభ న్యూస్): పశువులకు పచ్చి గడ్డి కోస్తుండగా జరిగిన విద్యుత్ ప్రమాదానికి గురై మంగలి నడిపి గంగారం (60) అనే వృద్ధుడు మృత్యువాత పడ్డ సంఘటన సిరికొండ మండలం కొండూర్ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. సిరికొండ ఎస్సై నరసింహులు అందించిన వివరాల ప్రకారం… కొండూర్ గ్రామానికి చెందిన మృతుడు మంగలి నడిపి గంగారం తన సొంత పొలం వద్ద పశువుల కోసం పచ్చిగడ్డి కోస్తుండగా బోరు మోటారుకు విద్యుత్ సరపరా చేసే వైర్ గడ్డి కొస్తున్న సమయంలో గడ్డితో పాటు విద్యుత్ వైర్ ను కోయడం వల్ల జరిగిన విద్యుత్ ప్రమాదంలో గంగారం మృతి చెందినట్లు ఎస్సై చెప్పారు.

మృతుడికి భార్య లక్ష్మి, మురళి, జనార్దన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నట్లు ఎస్సై వివరించారు. మృతుడి భార్య లక్ష్మి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని శవాన్ని పంచనామా నిమిత్తం నిజామాబాదులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ధర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement