Sunday, April 28, 2024

NZB: వీడీసీల ఆగడాలకు చర్యలుతీసుకోవాలి..సీపీకి ఫిర్యాదు

నిజామాబాద్ సిటీ, ఫిబ్రవరి 13(ప్రభ న్యూస్):కమ్మర్‌ప‌ల్లి మండలం చౌట్ పల్లి గ్రామంలో గౌడ కులస్తులను సాంఘిక బహిష్కరణ చేసిన విడీసీల ఆగడాలపై చర్యలు తీసుకోని న్యాయం చేయాలని కమ్మర్ పల్లి మండలం చౌట్ పల్లి గౌడ కులస్తులు సిపి కల్మేశ్వర్ ని కోరారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సిపి కార్యాలయంలో సిపిని చౌట్ పల్లి గ్రామంలోని గౌడ కులస్తులు మర్యాద పూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేసి వారు మాట్లాడారు. చౌట్ పల్లి గ్రామానికి చెందిన 87 గౌడ కుటుంబాలు గ్రామంలో మా దగ్గర ఎవరు కల్లు తాగవద్దని విడిసిలు గ్రామంలో ఆదేశాలు చేసి సాంఘీక బహిష్కరణ విధించారని ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement