Monday, May 6, 2024

Nizamabad : ర‌జ‌కుల‌కి అండ‌గా ఉంటా.. ఎమ్మెల్యే గ‌ణేష్ బిగాల‌

నిజామాబాద్ సిటీ, (ప్రభ న్యూస్) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై బి ఆర్ఎస్ లో చేరుతున్నారని, రజకులకు ఎల్లపుడూ అండగా ఉంటానని అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల అన్నారు. ఆదివారం నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ లో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలోగణేష్ బిగాల ఆధ్వర్యంలో రజక జన సేవా సంఘం సభ్యులు బిఆర్ఎస్ లో చేరారు. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… చెరువులకు వెళ్లి బట్టలు ఉతికే సంస్కృతి మారాలన్నారు.మోడ్రన్ పద్ధతిలో జిల్లాలో రెండు కోట్ల వ్యయంతో దోబి గాట్లని ఏర్పాటు చేశామన్నారు. ఎంబీసీ కులాలకు లక్ష సహాయం చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలం గాణ ప్రభుత్వమని పేర్కొ న్నారు.సబ్బండ వర్గాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సముచి త న్యాయం చేస్తున్నారని తెలి పారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. ప్రజల పట్ల వారు పడుతున్న తపన సంక్షేమ పథకాలను చూసి, కులాల పట్ల చూపిస్తున్న ప్రేమ అభిమా నానికి బిఆర్ఎస్ పార్టీలో చేరికలు జరుగుతున్నాయని అన్నారు.

రాష్ట్రంలో సబ్బన్న వర్గాలు సుఖశాంతులతో ఉండాలని ఉద్దేశంతో అన్ని వర్గాలకు సమైక్యత న్యాయం చేస్తున్నారని తెలిపారు. రజ కులు చెరువులకు వెళ్లి ఉతికి సంస్కృతి మారాలని మాడ్రన్ పద్ధతిలో దోబిగాట్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నిజామాబాద్ నగరం లో న్యాల్కల్ రోడ్లో రూ. రెండు కోట్లతో మాడ్రన్ ధోబిఘాట్లను నిర్మించడం జరుగుతుంద న్నారు. త్వరలోనే భూమి పూజ పనులు చేపడతామని అన్నా రు. దోబీ ఘాట్ లో మిషన్లతో పని చేసే విధంగా ఏర్పాట్లు చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంపీసీ కులాలకు బిసి గ్రాంట్ నుంచి ఒక కుటుంబానికి లక్ష రూపా యల సహాయం అందజేస్తు న్నారన్నారు. గతంలో నిజా మాబాద్ జిల్లాలో గుంతల రోడ్లు ఉండేవని ప్రస్తుతం సుంద ర రోడ్లు సెంటర్ మీటింగ్ లైట్స్ ఉన్నాయన్నారు. నిజామాబాద్ జిల్లా అన్ని జిల్లాలకు ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. అండర్ గ్రౌండ్, సెంటర్ మీటింగ్, ఎల్ఈడి లైట్లు నగరం వెలిగిపోతుందని అన్నారు. అన్ని కుల సంఘాల వర్గాలకు ఎల్లప్పుడు తోడుగా ఉంటానని ఎలాంటి సమస్య అయినా పరిష్కరిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతూ కిరణ్,నుడ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, పార్టీ నగర అధ్యక్షుడు సిర్ప రాజు, సత్య ప్రకాశ్, రజక జన సేవా సంఘం అధ్యక్షులు మాందారం సుదర్శన్, ప్రధాన కార్యదర్శి బగ్గలి అజయ్, ఉపాధ్యక్షులు మల్లెపూల గోపి, శేఖర్, జాయింట్ సెక్రెటరీ బగ్గలి కృష్ణ, మహిళా సభ్యులు భాగ్య, మానస ,భూలక్ష్మి ,సావిత్రి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement