Wednesday, May 15, 2024

Nirmal : విగ్రహ ప్రతిష్టకు హాజరైన.. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

నిర్మల్ రూరల్ .. ప్రభ న్యూస్ : మండలంలోని ఎల్లపల్లి గ్రామంలో రూ .10లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన ఆంజనేయస్వామి ఆలయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఆలయాలు అభివృద్ధికి నోచుకున్నాయని.. నియోజకవర్గంలో 900 మందిరాలను అభివృద్ధి చేస్తున్నామని.. ఎల్లపల్లి గ్రామంలో ఒక కోటి 65లక్షలతో.. ఆరు ఆలయాలను నిర్మించినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావన కలిగి ఉండాలని .. తద్వారా మనసు ఆహ్లాదంగా ప్రశాంతంగా ఉంటుంద‌దని తెలిపారు. సీఎం కేసీఆర్ .. కలెక్టరేట్.. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, రోడ్డు ప్రారంభించార‌ని చెప్పారు. జూలై నెల నుండి సొంత స్థ‌లం ఉన్నవారికి గృహ లక్ష్మీ పథకం ద్వారా ప్రభుత్వం మూడు లక్షలు సాయం చేయనున్నట్లు తెలిపారు.. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ప్స‌న్ విజయలక్ష్మి రెడ్డి.. అల్లోల మురళీధర్ రెడ్డి ,జడ్పిటిసి జీవన్ రెడ్డి, ఆత్మ చైర్మన్ గంగారెడ్డి dccb డైరెక్టర్ గంగాధర్, pacs చైర్మన్ బొండ్ల గంగాధర్, ఎన్. రాజా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement