Monday, April 29, 2024

TSPSC – పేప‌ర్ లీకేజ్ కేసులో మ‌రో ఇద్ద‌రికి బెయిల్ ..

హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో మరో ఇద్దరికి బెయిల్‌ లభించింది. ఈ కేసులో నిందితులైన‌ తండ్రీకుమారుడు మైబయ్య, జనార్దన్‌లకు నాంపల్లి కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో ఈ ఇద్దరు నిందితులను ఏప్రిల్‌ 21న సిట్‌ అధికారులు అరెస్టు చేశారు. డాక్యా నాయక్‌ నుంచి తన కుమారుడి కోసం ఏఈ ప్రశ్నపత్రాన్ని మైబయ్య రూ.2 లక్షలకు కొనుగోలు చేసినట్లు సిట్‌ దర్యాప్తులో తేలింది. తాజాగా ఈ ఇద్దరికి బెయిల్‌ మంజూరు చేయడంతో ఈ కేసులో ఇప్పటివరకు బెయిల్‌ పొందిన వారి సంఖ్య 17కు చేరింది. ఈ కేసులో ఇప్ప‌టి వ‌ర‌కు 39 మందిని అరెస్ట్ చేశారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement