Sunday, May 19, 2024

ADB: న‌వ‌దంప‌తుల ఆత్మ‌హ‌త్య…ఇంట్లో భార్య… స్మశాన వాటికలో భర్త…

ఉమ్మడి అదిలాబాద్ బ్యూరో, జనవరి 27(ప్రభ న్యూస్): ఆదిలాబాద్ జిల్లాలో తీవ్ర విషాధం నెల‌కొంది. పెళ్ల‌యిన 8నెల‌ల‌కే న‌వదంతులు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. ఈ ఘ‌ట‌న అదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం కొలహరి గ్రామంలో చోటుచేసుకుంది. దీంతో గ్రామంలో విషాధ ఛాయ‌లు అలుముకున్నాయి.

వివరాల్లోకి వెళితే.. సంక్రాంతి పండుగకు పుట్టింటికి వెళ్ళిన పల్లవి తిరిగి నిన్న మధ్యాహ్నం కొలహరికి వచ్చింది. ఆ సమయంలో కుటుంబ సభ్యులందరూ వ్యవసాయ క్షేత్రంలో ఉన్నారు. కుటుంబ సభ్యులు పనులు ముగించుకుని సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఇంటి తలుపు గడియ పెట్టి ఉండడంతో ఇరుగుపొరుగు వారిని పిలిచి తలుపులు తీయించి చూడగా ఆమె పురుగుల మందు సేవించి అపస్మారక స్థితిలో పడి ఉంది. ఆమె భర్త విజయ్ ప్రైవేట్ వాహనాన్ని తెప్పించి చికిత్స నిమిత్తం రిమ్స్ తీసుకెళ్లగా ఆమె మృతి చెందినట్లు వైద్యులు రాత్రి తెలిపారు.

భార్య మృతి చెందడంతో తనపై ఎలాంటి అపవాదు వస్తుందో అన్న భయంతో అదిలాబాద్ పట్టణ శివారు ప్రాంతమైన తీర్పెల్లి స్మశాన వాటికకు వెళ్లి అక్కడ పురుగుల మందు సేవించి కొట్టుమిట్టా డుతుండగా కొందరు బంధువులకు సమాచారం అందించారు. విజయ్ కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి అతనిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. పల్లవి ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియక పోగా తన భార్య ఆత్మహత్య భయంతోనే భర్త విజయ్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. శనివారం అదిలాబాద్ రిమ్స్ లో పంచనామ అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement