Saturday, May 25, 2024

TS: సొంత గూటికి రాజేంద‌ర్‌… పొన్నం స‌మ‌క్షంలో కాంగ్రెస్‌లో చేరిక

కరీంనగర్ కు చెందిన సీనియర్ నాయకుడు,మాజీ కార్పొరేటర్ మల్లికార్జున రాజేందర్ శనివారం ఉదయం రాష్ట్ర బి సి సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు.

తన అనుచరులతో కలిసి హైద్రాబాద్​లో మంత్రి పొన్నం నివాసంలో పార్టీ కండువా కప్పుకున్నారు. రాజేందర్ గతంలో కాంగ్రెస్ నుండి బిఆర్ఎస్‌లో చేరారు. బిఆర్ఎస్‌లో గుర్తింపు ఇవ్వకపోవడంతో తిరిగి స్వంత గూటికి వచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్, పార్టీ నాయకులు గడ్డపార వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement