Monday, April 29, 2024

New born baby : చెత్త కుప్ప‌లో అప్పుడే పుట్టిన‌ శిశువు…త‌ల్లిదండ్రుల ఆచూకీ కోసం పోలీసులు

చెత్త‌కుప్ప‌లో అప్పుడే పుట్టిన శిశువు ల‌భ్య‌మైంది. ఈఘ‌ట‌న నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లాలోని తెల‌క‌ప‌ల్లి మండ‌లం తాళ్ల‌ప‌ల్లిలో చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన శిశువును గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు చెత్త‌కుప్ప‌లో ప‌డేశారు.

శిశువు ఏడుపును గ‌మ‌నించిన స్థానికులు.. త‌క్ష‌ణ‌మే పోలీసుల‌కు, ఐసీడీఎస్ అధికారుల‌కు స‌మాచారం అందించారు. ప్రాణాల‌తో ఉన్న మ‌గ శిశువును పోలీసులు నాగ‌ర్‌క‌ర్నూల్ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం శిశువు ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌న్నారు. శిశువు త‌ల్లిదండ్రుల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement