Sunday, April 28, 2024

National Pensioners Day – ఘ‌నంగా సమాచార, పౌర సంబంధాల శాఖ విశ్రాంత ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం

హైద‌రాబాద్ – నేషనల్‌ పెన్షనర్స్ డే సందర్భంగా సమాచార, పౌర సంబంధాల శాఖ విశ్రాంత ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం తెలంగాణ టూరిజం ప్లాజాలో నిర్వ‌హించారు.., ఈ కార్య‌క్ర‌మంలో ముఖ్య అతిథిగా మాజీ కమిషనర్ బిపి ఆచార్య. , మాజీ డైరెక్టర్ కిస్మత్‌ కుమార్ , ప్రమోద రావు , సత్యా రావు , మాజీ CIE రమేశ్‌ కుమార్ ,పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు.
75 సంవత్సరాలు పూర్తి చేసిన విశ్రాంత ఉద్యోగులను ఘనంగా సన్మానించారు.

ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌స్తుతం అమెరికాలో ఉంటున్న మాజీ CIE రమేశ్‌ కుమార్ పూర్తిగా ఆర్థిక సహాయ సహకారాలు అందించారు. లాల్కోట వీరప్ప వ్రాసిన అమృతవాక్కులు – నిత్య సత్యాలు కవితా సంపుటిని ఈ కార్యక్రమంలో ఆవిష్కరించారు.


కిస్మ‌త్ కుమార్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన ఈ కార్యక్ర‌మంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ విశ్రాంత ఉద్యోగులు పెద్ద సంఖ్య‌లో పాల్గొన్నారు..
నిర్వాహణ‌కు విశ్రాంత CIE విజయ భాస్కర్‌ రెడ్డి , విశ్రాంత DD రషీద్ త‌మ వంతు స‌హ‌కారాలు అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement