Friday, April 26, 2024

ఓటరు నమోదు నిరంతర ప్రక్రియ : కలెక్టర్ పమేలా సత్పతి

యాదాద్రి : ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా 2022 జనవరి ఒకటవ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండి ఓటర్లుగా నమోదైన వారికి ఫోటో ఓటర్ గుర్తింపు కార్డు, ఎపిక్ కార్డులు బూత్ లెవల్ అధికారుల ద్వారా అందజేయనున్నట్లు కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. ఈరోజు నూతన ఓటర్ల నమోదు, కొత్తగా ఓటర్లుగా నమోదైన వారికి ఎపిక్ కార్డులు పంపిణీ చేయాలని అధికారులకు సూచించారు. ఫోటో ఓటర్ గుర్తింపు కార్డుతో పాటు, ఓటర్ కిట్ ను జాతీయ ఓటర్ దినోత్సవం జనవరి 25లోగా నూతనంగా నమోదైన ఓటర్లకు అందజేయాలని తెలిపారు. ఓటర్ కిట్ లో వ్యక్తిగత లేఖ, ఓటర్ గైడ్, ఓటర్ ప్రతిజ్ఞ, ఎపిక్ కార్డు కలిగి ఉంటుందన్నారు. ఓటర్ నమోదు నిరంతర ప్రక్రియ అని, 18 సంవ‌త్స‌రాలు నిండి ఓటర్ నమోదు, మార్పులు, చేర్పులు, సవరణకు వచ్చిన దరఖాస్తులు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ స‌మావేశంలో జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ డి.శ్రీనివాస్ రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement