Sunday, May 5, 2024

మునుగోడులో టీఆర్ఎస్ విజ‌యం ఖాయం : ఎమ్మెల్సీ కడియం శ్రీహరి

కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి రూ.18 వేల కోట్ల కాంట్రాక్ట్‌ కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని ఎమ్మెల్సీ క‌డియం శ్రీ‌హ‌రి అన్నారు. మునుగోడులో బీజేపీ ఆటలు సాగవని, గత ఎనిమిదేండ్లలో ఆ పార్టీ ప్రజలకు చేసిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌ కోవర్టురెడ్డి బ్రదర్స్‌ అని విమర్శించారు. ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయమని స్పష్టం చేశారు. తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుంతుంద‌ని, అది చూసి బీజేపీకి కక్ష అని విమర్శించారు. తెలంగాణ పట్ల కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి బాధ్యత లేదా అని ప్రశ్నించారు. బయ్యారంలో ఇనుప ఖనిజం నాణ్యమైనది కాదని కిషన్‌రెడ్డి చెప్పడం సిగ్గుచేటన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కేంద్రం కాలరాస్తున్నదని ఫైరయ్యారు. బీజేపీని ప్రశ్నిస్తే వారిపై ఈడీ, సీబీఐ, ఐటీలను ఉసిగొల్పుతున్నారని చెప్పారు. బీజేపీ అజెండా అంతా కులాల మధ్య కుంపటిపెట్టడమేనని ఆరోపించారు. బీజేపీ పేద, బడుగు, బలహీనవర్గాలకు శత్రువని చెప్పడంలో సందేహం లేదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement