Saturday, May 4, 2024

ఓటు హక్కు వినియోగించుకున్న రాహుల్ గాంధీ

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికల ఓటింగ్ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంతో పాటు పీసీసీ కార్యాలయాల్లో ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర క్యాంపు నుంచే ఓటు వేశారు. రాహుల్ గాంధీ సహా భారత్ జోడో యాత్రలో పాల్గొన్న దాదాపు 40 మంది ప్రతినిదులు బళ్లారి వద్ద జోడో యాత్ర క్యాంప్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement