Friday, May 17, 2024

రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది..సీఎం జగన్

రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో నాలుగో ఏడాది రైతు భరోసా నగదు జమ చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ… భరోసాతో రాష్ట్రవ్యాప్తంగా 50.92లక్షల మంది రైతన్నలకు లబ్ధి చేకూరుతుందన్నారు. తమది రైతు పక్షపాత ప్రభుత్వమన్నారు. రూ.2096.04కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. రాష్ట్రంలో రెండున్నర ఎకరాల్లోపు ఉన్న రైతులు 82శాతం ఉన్నారన్నారు. ఏడాదికి రైతుకు సాయంగా రూ.13,500 ఇస్తున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement