Tuesday, May 14, 2024

కొడ‌వ‌లి ప‌ట్టి – కంకులు కోసి.. ఓట్లు అభ్య‌ర్ధించిన టిఆర్ ఎస్ నేత‌లు

నల్లగొండ : నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ నాయకుల ప్రచారం ముమ్మ‌రం చేశారు. ఆ పార్టీ అభ్యర్థి నోముల భగత్‌కు మద్దతుగా ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌, ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, శంకర్‌ నాయక్‌, ఎమ్మెల్సీలు శ్రీనివాస్‌రెడ్డి, తేరా చిన్నపరెడ్డి క్షేత్రస్థాయిలో విస్తృతంగా గ్రామాల్లో ప‌ర్య‌టిస్తున్నారు.. ఇంటింటికి వెళ్లి ఓట్ల‌ను అభ్య‌ర్ధిస్తున్నారు.. ప్ర‌చారంలో భాగంగా గురువారం త్రిపురారం మండలంలోని లచ్చతండాకి చేరుకున్నారు నేత‌లు.. గ్రామాలోని ఓట‌ర్లు పొలం పనుల‌కు వెళ్ల‌డంతో అక్కడికే వెళ్లారు.. కూలీల‌తో పాటు న‌డుం వంచారు.. కొడ‌వ‌లి ప‌ట్టి కంకులు కోశారు..కూలీల‌తో మాట మంతి క‌లిపారు.. త‌మ అభ్య‌ర్ధి భ‌గ‌త్ కు ఓటు వేయాల‌ని అభ్య‌ర్ధించారు.. ఈ వీడియోను ఎమ్మెల్యే చిరుమ‌ర్తి త‌న ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement