Tuesday, April 30, 2024

టీఆర్ఎస్, బీజేపీల‌కు మునుగోడులో ఓటు అడిగే హ‌క్కు లేదు : పాల్వాయి స్రవంతి

మునుగోడులో టీఆర్‌ఎస్, బీజేపీలకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని మునుగోడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి (అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో తమకు పోటీ టీఆర్ఎస్ పార్టీయే అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో అభిప్రాయ భేదాలు తప్ప వర్గ పోరు లేదని తెలిపారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తప్పకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని చెప్పారు. మునుగోడు ఎన్నికల్లో గెలుపు కోసం సమిష్టిగా కృషి చేస్తారన్న నమ్మకం ఉందన్నారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పాల్వాయి గోవర్ధన్ రెడ్డి బిడ్డగా తనను ఆశీర్వదిస్తారన్న నమ్మకం ఉందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి, బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని స్రవంతి పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement