Saturday, May 4, 2024

NLG: టీకా వికటించి మూడు నెలల బాలుడు మృతి..!

మద్దిరాల, అక్టోబర్ 22 (ప్రభ న్యూస్) : టీకా వికటించి మూడు నెలల బాలుడు మృతిచెందిన సంఘటన మండల కేంద్రంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం… మండల కేంద్రానికి చెందిన రాంపాక నాగరాజు, స్వరూప దంపతులకు మూడు నెలల క్రితం బాలుడు జన్మించాడు. శనివారం ఉదయం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మద్దిరాలలో బాలుడికి మూడో నెల డోస్ ఇంజక్షన్ ఏఎన్ఎం ద్వారా అందించారు.

తర్వాత కొద్దిసేపటికి జ్వరం వచ్చింది. వెంటనే వారు ఇచ్చిన సిరప్ వేసినా తగ్గకపోవడంతో వైద్య సిబ్బందికి సమాచారం అందించారు. అయినప్పటికీ వారు స్పందించకపోవడంతో పాటు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకోవడం జరిగిందని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. సంబంధిత వైద్య సిబ్బందిని వివరాలు కోరగా.. ఈ బాబుతో పాటు మరో నలుగురి పిల్లలకు ఇంజక్షన్ ఇవ్వడం జరిగింది. వారికి ఎలాంటి అపాయం జరగలేదు. ఇంజక్షన్లు సీజ్ చేసి వెంటనే పరీక్షల కోసం పంపిస్తామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement