Monday, May 6, 2024

NLG: క్రీడలు స్నేహా భావాన్ని పెంపొందిస్తాయి….ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్

దేవరకొండ, జనవరి 3(ఫ్రభ న్యూస్): క్రీడలు స్నేహాభావని పెంపొందిస్తాయి అని దేవరకొండ నియోజకవర్గం శాసనసభ్యులు నేనావత్ బాలు నాయక్ అన్నారు. నల్గొండ జిల్లా దేవరకొండ మండలం మైనంపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న కొర్ర రమేష్ నాయక్ స్మారక నియోజకవర్గ స్థాయి క్రికెట్ పోటీలను బుధవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నల్లగాసు జానీ యాదవ్,పీసీసీ సభ్యులు టోర్నమెంట్ స్పాన్సర్ జాలే నర్సింహారెడ్డి, సిరాజ్ ఖాన్,డాక్టర్ వేణుధర్ రెడ్డి,మాజీ మార్కెట్ చైర్మన్ ముక్కమల్ల వెంకటయ్య గౌడ్,మైనంపల్లి ఎంపీటీసీ కొర్ర గౌతమి-రాంసింగ్ నాయక్ త‌దిత‌రులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement