Sunday, April 28, 2024

MPDO : గుండెపోటుతో ఎంపీడీవో శ్రీధర్‌ మృతి

తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా మంగపేట మండలంలో విషాదం చోటుచేసుకుంది. మంగపేట మండల పరిషత్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ (MPDO) గా విధులు నిర్వహిస్తున్న కర్నాటి శ్రీధర్ (55) ఇవాళ‌ ఉదయం గుండెపోటుతో మృతిచెందారు.

నాలుగు రోజుల క్రితం గుండెనొప్పి రావడంతో ఎంపీడీవో శ్రీధర్‌ను ఆయన కుటుంబసభ్యులు హనుమకొండలోని ఓ ప్రైవేటు దవాఖానలో చేర్పించారు. గత నాలుగు రోజులుగా చికిత్స పొందుతూ ఇవాళ‌ తెల్లవారుజామున ఆయన మరణించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement