Wednesday, May 15, 2024

సాగ‌ర్ కాంగ్రెస్ అభ్య‌ర్ధి జానారెడ్డి నామినేష‌న్ దాఖ‌లు..

నాగార్జునసాగర్ ఉప ఎన్నికల‌లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కె జానారెడ్డి నేడు త‌న నామినేష‌న్ దాఖ‌లు చేశారు..
నిడమనూరు ఆర్వో కార్యాలయానికి కొద్దిమంది కాంగ్రెస్ నేత‌ల‌తో వ‌చ్చిన ఆయ‌న త‌న నామినేష‌న్ ప‌త్రాల‌ను రిట‌ర్నింగ్ అధికారికి అంద‌జేశారు.. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జగ్గారెడ్డి త‌దిత‌రులు హాజరయ్యారు. నామినేషన్ వేసిన అనంతరం జానారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా ఓటరుకు స్వేచ్ఛ ఇవ్వాలన్నారు. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి పునాదులు వేసేలా ప్ర‌చారానికి దూరంగా ఉండాల‌ని టీఆర్‌ఎస్, బీజేపీలను కోరారు..తాను కూడా ఎటువంటి ప్ర‌చారాన్ని నిర్వ‌హించ‌బోన‌ని అన్నారు.. భారత దేశంలోనే ప్రయోగాత్మకంగా నామినేషన్స్ వేసి ప్రచారాలకు పోకుండా ఉండేందుకు టీఆర్‌ఎస్, బీజేపీ ముందుకు రావాల‌ని జానారెడ్డి కోరారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement