జనగామ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సదరం క్యాంప్ ని ఏర్పాటు చేశారు. ఈ క్యాంప్ లో 44 మందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించినట్లు ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ పి. సుగునాకర్ రాజు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సదరం క్యాంపులో పాల్గొనేందుకు 50మంది వికలాంగులు..మీ సేవ లో దరఖాస్తు చేసుకున్నారు. కానీ 44 మంది మాత్రమే హాజరు అయ్యారని తెలిపారు. ఈ శిబిరంలో ఆసుపత్రి వైద్యులు ప్రదీప్ కుమార్,విజయ రాజ్,డి అర్ డి ఎ కార్యాలయ సిబ్బంది వినిత, రమేష్,కవిత, అనిత, శారద తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement