Thursday, April 25, 2024

Tollywood: పునీత్ మృతిపై టాలీవుడ్ హీరోలు దిగ్భ్రాంతి

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం చెందడం దక్షిణాది చిత్ర పరిశ్రమలను తీవ్ర విషాదానికి గురిచేసింది. టాలీవుడ్ హీరోలు చిరంజీవి, మహేశ్ బాబు, జూ.ఎన్టీఆర్, నాగార్జున తదితరులు దిగ్భ్రాంతికి గురయ్యారు.

పునీత్ రాజ్ కుమార్ మరణం అత్యంత బాధాకరమని, తీవ్ర వేదనతో హృదయం ముక్కలైందని చిరంజీవి పేర్కొన్నారు. పునీత్ రాజ్ కుమార్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని, అతని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కన్నడ చిత్ర పరిశ్రమే కాకుండా, యావత్ భారత చిత్ర రంగానికి పునీత్ మరణం పెద్ద లోటు అని పేర్కొన్నారు. పునీత్ కుటుంబానికి, బంధుమిత్రులకు, అభిమానులకు ధైర్యం చేకూరాలని ఆశిస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.

పునీత్ మృతిపై సూపర్ స్టార్ మహేశ్ బాబు సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పునీత్ రాజ్ కుమార్ ఇక లేరన్న విషాదవార్త చూసి షాక్ కు గురయ్యానని, తీవ్ర విచారం కలుగుతోందని పేర్కొన్నారు. తాను ఇప్పటివరకు కలిసి, మాట్లాడిన వారిలో అత్యంత వినమ్రుడైన వ్యక్తి పునీత్ రాజ్ కుమార్ అని వివరించారు. పునీత్ కుటుంబ సభ్యులకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు హార్దిక సంతాపం తెలియజేస్తున్నానని ట్వీట్ చేశారు. పునీత్ కుటుంబానికి జూ.ఎన్టీఆర్, నాగార్జున, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు తదితర హీరోలు సంతాపం తెలిపారు.

- Advertisement -

ఇది కూడా చదవండి: క‌న్న‌డ స్టార్ హీరో పునీత్ రాజ్ క‌న్నుమూత‌..

Advertisement

తాజా వార్తలు

Advertisement