Sunday, April 28, 2024

TS : ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రీతం

మోత్కూర్, మార్చి 17 (ప్రభ న్యూస్): రాష్ట్ర ఎస్సి కార్పొరేషన్ చైర్మన్ గా యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ కి చెందిన టీపీసీసీ రాష్ట్ర ఎస్సి సెల్ చైర్మన్ నాగరిగారి ప్రీతం ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. తాజాగా 37 మంది కార్పొరేషన్ చైర్మన్ లను ప్రభుత్వం నియమించగా ప్రీతం కు ఆ జాబితాలో చోటుదక్కింది.

- Advertisement -

కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి అనుచరిడిగా ఉన్న ప్రీతం రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలలో కీలక పాత్ర పోషించడంతో పాటు పలు రాష్ట్రాలకు ఎన్నికల ఇంచార్జి గా పనిచేశారు.చిన్న వయసులోనే ఎన్ ఎస్ యూ ఐ,యూత్ కాంగ్రెస్ నాయకునిగా జాతీయ స్థాయిలో పనిచేసిన అనుభవం,గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం లో రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు,దళితుల హక్కుల కోసం ఆందోళనలు చేపట్టారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి గా పోటీలో ఉన్నప్పటికీ టికెట్ రాలేదు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం ఎస్సి కార్పొరేషన్ చైర్మన్ పదవిని అప్పగించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement