సూర్యపేట : స్వర్గీయ ఆచార్య జయశంకర్ సేవలు చిరస్మరణీయమని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఫ్రొఫెసర్ జయశంకర్ సర్ వర్దంతి సందర్బంగా సూర్యపేట జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో జయశంకర్ సార్ చిత్ర పటానికి మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన మహా ఉద్యమానికి జయశంకర్ మార్గదర్శకులుగా నిలిచారన్నారు. రాష్ట్రంలోని యువత జయశంకర్ ను ఆదర్శంగా తీసుకొని ఆయన ఆశయాలకు అనుగుణంగా పని చేయాలన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement