Sunday, May 19, 2024

ఎమ్మెల్యే శేఖర్ రెడ్డిపై ఐటి దాడులు అమానుషం..

ప్రభన్యూస్, ప్రతినిధి, యాదాద్రి : భువనగిరి నియోజకవర్గం నుండి మచ్చలేని నాయకుడిగా ఎదుగుతూ, అవినీతి ఆరోపణలు లేని ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డిపై ఐటి దాడులు చేయించడం అమానుషమని భారాస జిల్లా అధ్యక్షుడు, ఆయిల్ ఫెడ్ చైర్మెన్ కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు.

బుధవారం విలేకరులతో మాట్లాడుతూ చాలామంది పేద ప్రజలకు,విద్యార్థులకు ఆర్థికంగా సహాయపడిన వ్యక్తి పైళ్ళ శేఖర్ రెడ్డి అని, గ్రామాల అభివృద్ధికి, రైతుల కోసం కాలువలను పునః వ్యవస్థీకరించడం కోసం తన సొంత డబ్బులను ఖర్చు చేసిన మహావ్యక్తి అన్నారు.

- Advertisement -

ఆయన చేస్తున్న వ్యాపారాలు ఎలాంటి అవకతవకలు లేకుండా చట్టబద్ధంగా,నిజాయితీగా చేస్తున్నారని, బిజెపి పార్టీ స్వార్ధ రాజకీయాల కోసం ఎన్నికల లబ్దికోసం పైళ్ళ శేఖర్ రెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ఆఫీసులపై, వ్యాపార సంస్థలపై ఇళ్లపై దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురిచేయాలనుకోవడం సిగ్గుచేటన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement