Thursday, May 2, 2024

NLG: ఇల్లు కూలిన బాధితులకు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో టార్పాలిన్ల అందజేత

మోత్కూర్, జులై 28 (ప్రభ న్యూస్) : మండలంలో గత పది రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలకు ఇల్లు కూలిన బాధితులకు రెడ్ క్రాస్ సంస్థ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు మోత్కూర్ మున్సిపల్ కేంద్రంతో పాటు, మండలంలోని పొడిచేడు గ్రామంలో ఇల్లు కూలిన 10మంది బాధితులకు టార్పాలిన్ల‌ను రెడ్ క్రాస్ సంస్థ జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లా చైర్మన్ డాక్టర్ గుర్రం లక్ష్మీ నరసింహ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం అందజేశారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బాధితులు వర్షాకాలంలో రెడ్ క్రాస్ సంస్థ అందిస్తున్న టార్పాలిన్లను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సంస్థ సీనియర్ సభ్యులు ఎస్ ఎన్ చారి, కాగితాల నర్సిరెడ్డి, మోత్కూర్ శాఖ సభ్యులు పన్నాల శ్రీనివాస్ రెడ్డి, మెట్టు మంగేష్, ముప్ప వెంకట్ రెడ్డి, బుస్స రవి, యూత్ విభాగం జిల్లా అధ్యక్షుడు బీసు మచ్చగిరి, పొడిచేడు సర్పంచ్ మధు, తదితరులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement