Saturday, May 4, 2024

NLG: వెంక‌టేశ్వ‌ర‌స్వామిని ద‌ర్శించుకున్న డిప్యూటీ సీఎం…ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు

తెలంగాణ డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క ఖ‌మ్మం జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. ఇందులో భాగంగా ఎర్రుపాలెంలో జ‌రిగే కార్య‌క్ర‌మానికి పాల్గొనేందుకు పయాణ‌మ‌య్యారు. మార్గ‌మ‌ధ్య‌లో బరాకత్ గూడెం గ్రామ శివారులో ఉన్న వెంక‌టేశ్వ‌ర‌స్వామి ఆల‌యానికి వెళ్లారు.

స్వామి వారిని ద‌ర్శించుకొని ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. అనంత‌రం ఆల‌యం చుట్టూ ప్ర‌ద‌క్ష‌ణ‌లు చేశారు. ఆల‌యానికి డిప్యూటీ సీఎం హోదాలో వ‌చ్చిన భ‌ట్టికి ఆల‌య అర్చ‌కులు కందాల శ్రీనివాసాచార్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఘనంగా సన్మానించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆయ‌న వెంట ఎమ్మెల్యే ఉత్త‌మ్‌ప‌ద్మావ‌తిరెడ్డి కూడా స్వామివారికి పూజ‌లు నిర్వ‌హించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement