Sunday, April 28, 2024

Budda: వారం రోజుల‌లోనే జ‌గ‌న్ సైకో అని తెలుసుకున్న అంబ‌టికి శుభాకాంక్ష‌లు … టిడిపి ఎమ్మెల్సీ బుద్దా..

తిరువూరు – అడుదాం ఆంధ్రాకి అంబటి రాయుడు బ్యాట్ పట్టుకొని వచ్చార‌ని.. వచ్చిన వారం రోజులకే జగన్ సైకో అని అంబటి రాయుడికి తెలిసి రాజీనామా చేశారి పేర్కొన్నారు టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంక‌న్న‌.. రాజీనామా చేసిన అంబటి రాయుడుకి శుభాకాంక్షలు అని తెలిపారు.

తిరువూరులో చంద్రబాబు సభ నిర్వహణపై విజయవాడ వెస్ట్ నేతలతో సమావేశమైన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తిరువూరులో చంద్రబాబు సభకి విజయవాడ నుంచి ర్యాలీగా వెళ్తున్నామ‌ని వెల్ల‌డించారు. 2024లో పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరవేయబోతున్నామ‌ని అంటూ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి ఎవరనేది చంద్రబాబు చెబుతార‌న్నారు. . అందరం కలిసికట్టుగా పార్టీ గెలుపుకు పనిచేస్తాం అని ప్రకటించారు. టీడీపీలో బిసిల‌కు పదవులు ఇవ్వటంతో పాటు నేతలకు ప్రత్యేక గుర్తింపు ఉంటుందన్నారు బుద్దా వెంకన్న.

టీడీపీలో ఉన్న బీసీ నేతలకు వైసీపీలో ఉన్న బీసీ నేతలకు పోలిక లేదన్న ఆయన. వైసీపీలో ఒకరైన గుర్తింపు పొందిన బీసీ నేత ఉన్నారా? అని ప్రశ్నించారు. ఆర్ కృష్ణయ్యకి రాజ్యసభ ఇవ్వటాన్ని మేం తప్పుపట్టడం లేద‌ని, కానీ, రాజ్యసభలలో ఫ్లోర్ లీడర్ పదవి కృష్ణయ్యకి ఎందుకు ఇవ్వలేదు? అని ప్రశ్నించారు. టీడీపీ బీసీ నేతలకి ప్రయారిటీతో పాటు గౌరవం ఇస్తుందన్నారు. ఇక, వైఎస్ కుటుంబానికి కొడాలి నాని గౌరవిస్తారు తప్ప.. ఎన్టీఆర్ కుటుంబానికి ఇవ్వర‌ని మండిపడ్డారు. చంద్రబాబు అరెస్టు చేస్తే 100 దేశాలలో ఆందోళన చేశారని అంటూ చంద్ర‌బాబుపై ఒంటికాలి మీద లేచిన . కొడాలి నానిని ఏ దేశం వెళ్లినా వదలరు అని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement