Sunday, May 19, 2024

TS | లాకప్ డెత్ విచారణ జరపండి.. బాధ్యులపై చర్యలు తీసుకోండి

నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గానికి చెందిన నేనావత్ సూర్య నాయక్ లాక్ అప్ డెత్ పై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్, మాజీ ప్రభుత్వ విప్ బాల్క సుమన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్ లు రాష్ట్ర డిజిపి రవి గుప్త ను కోరారు. గురువారం డిజిపి ని కలిసి సీనియర్ అధికారి చే పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement