Wednesday, May 15, 2024

NLG: పేదలకు అండగా సీఎం సహాయనిధి.. ఎమ్మెల్యే రవీంద్ర కుమార్

దేవరకొండ, ఆగస్టు 1(ఫ్రభ న్యూస్) : పేదలకు అండగా సీఎం సహాయనిధి ఉందని, ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు సీఎం కేసీఆర్ ఆపద్బాంధవుడు అని దేవరకొండ శాసన సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దేవరకొండ నియోజకవర్గంలోని 133మందికి రూ.36.66లక్షలు సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను బాధితులకు ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ముఖ్యమంత్రి సహాయనిధిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆపద సమయంలో వైద్య ఖర్చుల కోసం బాధిత కుటుంబాలకు సీఎం కేసీఆర్ అందజేస్తున్న సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సీఎం సహాయ నిధి ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వేలాదిమంది నిరుపేదల ప్రాణాలు నిలబడ్డాయన్నారు. ప్రమాదవశాత్తూ గాయపడిన వారు కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్య సేవలను పొందేందుకు ప్రభుత్వం ఆర్ధిక సాయం అందజేస్తోందన్నారు. పార్టీలకు అతీతంగా ప్రభుత్వం సీఎం సహాయ నిధి చెక్కులను అందజేస్తోందన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాధవరం సునీతజనార్ధన్ రావు, వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాష్, వైస్ చైర్మన్ రహత్ అలీ, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు దొందేటి మల్లా రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ముత్యాల సర్వయ్య, గోసుల అనంతగిరి, అర్వపల్లి నర్సింహ, పొన్నబోయిన సైదులు, ముడవత్ జయప్రకాష్ నారాయణ, బొడ్డుపల్లి కృష్ణ, కుంభం శ్రీశైలం గౌడ్, ముత్యాల రవి, రమావత్ చందు, కుంభం నరేష్, బాదేపల్లి నిరంజన్, పేర్వాల వెంకటయ్య, లక్ష్మణ్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement