Sunday, April 28, 2024

NLG: కారు – బైక్ ఢీ.. ఒక‌రి మృతి

కారు, బైక్ ఢీకొని ఒకరు మృతి చెందగా.. నలుగురికి గాయాలైన ఘటన నల్గొండ జిల్లాలోని నూతనకల్ మండలంలోని గుండ్ల సింగారం గ్రామ శివారులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. టీఎస్ 05 యుసీ 0261 నెంబరుతో ఉన్న కారు తొర్రూరు నుంచి సూర్యాపేటకు వెళ్తుంది. ఈ క్రమంలో కారు గుండ్లసింగారం హెచ్‌పీ పెట్రోల్ బంక్ వద్దకు రాగానే టీఎస్ 26 జీ 4226 నెంబర్‌తో ఉన్న పల్సర్ బైక్ ఎదురెదురుగా ఢీకొన్నాయి.

ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న దంతాలపల్లికి చెందిన తూర్పాటి గణేష్ తండ్రి ఉప్పలయ్య (23) స్పాట్‌లోనే మృతిచెందాడు. బైక్‌పై ప్రయాణిస్తున్న మరో ముగ్గురు పెండెం శ్రీను, దానబోయిన సమ్మయ్య, రోహిత్, కారు డ్రైవర్ చిన్నపాక చందులకు గాయాలయ్యాయి. గాయ‌ప‌డిన వారిని చికిత్స కోసం హాస్ప‌ట‌ల్ కు త‌ర‌లించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement