Sunday, April 28, 2024

TS: వీళ్లు ప‌శువులే… ఒకడు కుమార్తెను…మ‌రొక‌డు భార్య‌ను…

హైద‌రాబాద్ – రోజు రోజుకి మాన‌వ సంబంధాలు విచ్చిన‌మైపోతున్నాయి.. ఆండ‌గా ఉండాల్సిన వాడు…ర‌క్ష‌ణ క‌వ‌చంగా భావించ‌న వాడు ప‌శువులై హంత‌కులుగా మారిపోతున్నారు.. ఒకడు కుమార్తెను చెర‌బ‌డితే మ‌రోక‌డు భార్య త‌ల న‌రికేశాడు.. ఈ రెండు దారుణాలు తెలంగాణ‌లో చోటు చేసుకున్నాయి..

తాగిన మైకంలో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. వావివరసలు మరిచి కన్నకూతురిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు సర్కిల్ పరిధిలోని బీబీ పేట మండలంలో జరిగింది. వివరాల‌లోకి వెళితే మూడు రోజుల క్రితం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇంటికి కల్లు తెచ్చుకున్నాడు. తెచ్చిన కల్లును కూతురుకు తాగించి తను తాగాడు. భార్య ఇంట్లో లేని సమయంలో అర్ధరాత్రి పొద్దు పోయాక మైనర్ బాలిక అయిన(16) కూతురుపై లైంగిక దాడికి దిగాడు. మరుసటి రోజు తన తల్లికి జరిగిన విషయాన్ని ఏడుస్తూ బాలిక చెప్పింది. దీంతో ఈ విషయం చుట్టుపక్కల వారికి తెలియడంతో తండ్రి ని చితక్కొట్టడంతో తప్పించుకొని పారిపోయాడు. పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో కామారెడ్డి ఇన్‌చార్జ్ డీఎస్పీ శ్రీనివాస్ అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు.

భార్య త‌ల న‌రికేసిన భ‌ర్త ..
హైదరాబాద్ శివార్లలోని అబ్దుల్లాపూర్ మెట్ కాలనీలో మూడేళ్లుగా నివాస‌ముంటున్న వినయ్-పుష్పలత దంపతులకు ఒక బిడ్డ కూడా ఉంది. మూడేళ్ల కాపురం ఆ తరువాత ఏం జరిగిందో ఏమోగానీ.. వీరి జీవితంలో కలతలు మొదలయ్యాయి. భార్యపై అనుమానం పెంచుకున్నాడు భర్త. ఆమెపై అనుమానం కారణంగా రోజూ గొడవలు జరిగేవి. అయితే ఒకరోజుతో ఆగలేదు.. ఆమెపై అనుమానం ఇంకాస్త పెరగడంతో వినయ్ సహించలేకపోయాడు. ఆమెను హతమార్చేందుకు ప్లాన్ వేశాడు. రోజూలాగే నిన్న ఇంటికి వెళ్లాడు. ఆమెతో గొడవకు దిగాడు. మాట మాట పెరింగింది. దీంతో ఆవేశంతో రగిలిపోయిన వినయ్ భార్య పుష్పలతను తలనరికి అతి కిరాతకంగా హత్య చేశాడు. గట్టిగా కేకలు వినిపించడంతో.. స్థానికులు వచ్చి చూడగా మృతదేహం పక్కనే తల నరికిపెట్టి అక్కడే కూర్చున్న వినయ్ ను చూసి స్థానికులు షాక్ తిన్నారు. భయాందోళనకు గురైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అత‌డిని పోలీసులు అరెస్ట్ చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement