Saturday, April 27, 2024

పన్ను వ‌సూళ్ల‌కు వినూత్న ప్ర‌యోగం.. షాపింగ్ మాల్స్ ముందు సిబ్బంది ధ‌ర్నా..

సూర్యాపేట మున్సిపాలిటీకి రావాల్సిన‌ ఇంటి పన్ను చెల్లించకపోవడంతో వసుంధర షాపింగ్ మాల్, ఎంజీ రోడ్ లోని బృందావన్ రెస్టారెంట్ ముందు మున్సిపల్ బిల్ కలెక్టర్లు, పారిశుద్ధ్య సిబ్బంది సోమవారం ధర్నాకు దిగారు. ఈ విషయం గురించి అక్కడి వారు ఆరా తీయగా వసుంధర షాపింగ్ మాల్ వారు చెల్లించవలసిన ఇంటి పన్ను రూ.845036/లు బకాయి, సాయి బృందావన్ గ్రాండ్ బిల్డింగ్ యాజమాన్యం వారు రూ.6,96,768/-లు బకాయి ఉన్నందున నోటీసులు జారీ చేశామని, బకాయి చెల్లించాల‌ని చెప్పినా.. ఎలాంటి స్పందన రాలేదన్నారు. అందుకే నిరసన ధర్నాకు దిగామని అన్నారు. ఇప్పటికైనా మున్సిపాలిటీకి చెల్లించాల్సిన పన్నులు సకాలంలో చెల్లించి పట్టణ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని వారు కోరారు. లేకపోతే రేపు అందరి ఇండ్ల వొద్ద ఇదే పరిస్థితి రావచ్చు.. తస్మాత్ జాగ్రత్త..!

Advertisement

తాజా వార్తలు

Advertisement