Tuesday, April 30, 2024

భ‌ర్త మంద‌లించాడ‌ని….

సూర్యాపేట: భ‌ర్త మంద‌లించాడ‌ని భార్య త‌న కుమార్తెతో స‌హా ఆత్మ‌హ‌త్య చేసుకుంది.. ఈ విషాద సంఘ‌ట‌న సూర్యాపేట‌లో చోటు చేసుకుంది.. స్థానికంగా నివాస‌ముంటున్న నాగ‌మ‌ణిని భ‌ర్త గ‌త రాత్రి పని విష‌యంలో మంద‌లించాడు.. దీంతో తీవ్ర మ‌న‌స్థాపానికి గురైన నాగ‌మ‌ణి త‌న కుమార్తె పావ‌నితో క‌ల‌సి మినీ ట్యాంక్ బండ్ లో దూకింది.. స్థానికులు గ‌మ‌నించి పోలీసుల‌కు స‌మాచార‌మిచ్చారు.. అక్క‌డి చేరుకున్న అగ్నిమాప‌క సిబ్బంది, పోలీసులు ట్యాంక్ బండ్ నుంచి త‌ల్లీ కూతుళ్ల మృత‌దేహాల‌ను వెలికి తీసి పోస్ట్ మార్ట‌మ్ కోసం హాస్ప‌ట‌ల్ కు త‌రలించారు.. కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement