Tuesday, May 14, 2024

Nalgonda – చలో భాట సింగారం – నల్గొండ జిల్లాలో బిజెపి నేతల ముందస్తు అరెస్ట్ లు

డిండి జూలై 20 (ప్రభ న్యూస్) బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో తలపెట్టిన చలో బాటసింగారం కార్యక్రమానికి తరలివెళుతున్న నేతలను నల్గొండ జిల్లాలలో వివిధ ప్రాంతాలలో ముందస్తుగా అరెస్ట చేశారు..కాగా, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పరిశీలన కు పోకుండా ప్రభుత్వం ముందస్తు అరెస్టులకు పాల్పడుతుందని బిజెపి దేవరకొండ అసెంబ్లీ కన్వీనర్ ఆమనగంటి కృష్ణ అన్నారు గురువారం ఆయన మాట్లాడుతూ బి ఆర్ ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే డబల్ బెడ్ రూమ్ లు ఇస్తాం అని చెప్పి ఇవ్వకుండా మోసం చేస్తున్నారని విమర్శించారు తెలంగాణలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ప్రతి ఒక్క పేదవారికి ఇండ్లు నిర్మించి ఇస్తుందని అన్నారు అరెస్ట్ అయిన వారిలో సిం కారు సైదా, వావిళ్ళ అంజి, నోముల సాయి, అమృత్ తదితరులున్నారు

అక్రమ అరెస్ట్ లు అపరాజస్వామికరం

మద్దిరాల – అక్రమ అరెస్టులు చేయడం అప్రజా స్వామి కమ్మని బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు భూతం సాగర్ అన్నారు గురువారంబీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని పిలుపు మేరకు చలో బాటసింగారం డబుల్ బెడ్రూం ఇండ్ల పరిశీలనకు పోకుండా తెరాస ప్రభుత్వం ముందస్తు అరెస్ట్ లు చేయడం సరైనది కాదని అన్నారు. .అధికారంలో వస్తే డబుల్ బెడ్రూం లు ఇస్తాం అని గొప్పలు చెప్పి గద్దెనెక్కిన ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు కట్టించిన ఇండ్లకు పేద ప్రజలకు ఇయ్యకుండ కెసిఆర్ మోసం చేస్తున్నారని ఆరోపించారు. మద్దిరాల మండలం కేంద్రం లో నిర్మించిన
ఇండ్లను అర్హులైన తి పేదవానికి డబల్ బెడ్రూం ఇల్లు కేటాయించాలని, లేనిపక్షంలో ఈ ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని అన్నారు . ఈ కార్యక్రమంల మద్దిరాల మండల బిజెపి నాయకులు పాల్గొన్నారు

- Advertisement -

బిజెపి నాయకుల అరెస్ట్.. పోలీస్ స్టేషన్ కు తరలింపు…

హుజూర్ నగర్ అర్బన్ -) రాష్ట్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లపై బిజెపి పార్టీ సాగిస్తున్న పోరుబాట కార్యక్రమంలో భాగంగా బాటసింగారం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించేందుకు బిజెపి నాయకులు హుజూర్నగర్ ప్రాంతం నుండి తరలి వెళ్తున్న క్రమంలో గురువారం నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అరెస్టు అయిన వారిలో ఇంటి రవి అంబల్ల నరేష్ మందా వెంకటేశ్వర్లు లక్ష్మయ్య తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement