Sunday, May 19, 2024

MRPS – మాదిగలను మోసం చేసిన డేßబీఆర్ఎస్, కాంగ్రెస్ కుఓటు వేయేద్దు – మంద కృష్ణ మాదిగ

నిజామాబాద్ సిటీ, నవంబర్ (ప్రభ న్యూస్)25: మాదిగలను మోసం చేస్తున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ కు ఓటేయ వద్దని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. శనివారం నిజామాబాద్ నగరంలోని వినాయక నగర్ లో బీజేపీ అభ్యర్థి ధన్పాల్ సూర్యనా రాయణ ఎన్నికల ప్రచార కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మందకృష్ణ మాదిగ హాజరై మాట్లాడారు అందరివాడు.. ఆపద్బాంధవుడు ధన్పాల్ సూర్యనారాయణను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.30 ఏళ్లుగా ఒకే జెండా కింద పని చేస్తూ పోరాడానని, వర్గీకరణ కోసం ఢిల్లీ చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా గత కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించు కోలేదని తెలిపారు. మాదిగ జాతి బిడ్డల భవిష్యత్ కోసం పోరాటం చేశానని, గత పాల కులు మనల్ని విస్మరించారని గుర్తుచేశారు. సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ మన కోసం వచ్చి ఎస్సీ వర్గీకరణకు అనుకూలం గా ఉన్నామని, ఇందుకోసం కమిటీ వేస్తున్నామని ప్రకటిం చారని పేర్కొన్నారు. మాట ఇచ్చి నిలబెట్టుకునే పార్టీ ఏకైక పార్టీ బీజేపీ అన్నారు. ఉద్యమ సమయంలో అండగా నిలిచిన తనను కేసీఆర్ సీఎం అయ్యాక రెండుసార్లు జైల్లో పెట్టారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్ మంత్రివర్గంలో ఒక్క మాదిగ బిడ్డ లేడన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లకు ఓటేయవద్దని అన్నివర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ కోసం మాదిగ యువత ఉద్యమించారని, అటువంటి మన ఉద్యమాన్ని కేసీఆర్ అణచివేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల వద్దకు వెళ్లిన తనను వారు పట్టించుకోలేదని, బీజేపీ నాయకులు మన దగ్గరకు వచ్చి మాదిగలను అక్కున చేర్చుకున్నారని తెలిపారు. ఇందూరు నగర ప్రజల కష్టాల్లో పాలుపంచుకునే ధన్ఫాల్ సూర్యనారాయణను భారీ మెజార్టీతో గెలిపించాలని, కమలం పువ్వుగుర్తుకు ఓటేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఆర్బన్ అభ్యర్థి భన్పాల్ సూర్య. నారాయణ, జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య. ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కనక ప్రమోద్, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు బీఆర్ శివప్రసాద్. రాష్ట్ర నాయకులు లింగంపల్లి లింగం, పడిగెల వెంకటేష్ కుమార్, ఎద్ద బాలకృష్ణ గడ్డం రాజు, శ్రీరాం, మాదిగ

Advertisement

తాజా వార్తలు

Advertisement