Saturday, May 18, 2024

Shabbir Ali – కెసిఆర్ పిట్టలదొర మాట నమ్మి మోసపోవద్దు

నిజామాబాద్ సిటీ, నవంబర్ (ప్రభ న్యూస్) 25:.కెసిఆర్ పిట్టలదొర మాట రాష్ట్ర ప్రజలు నమ్మి మోసపోవద్దని నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. శనివారం నిజామా బాద్ పట్టణంలోని నెహ్రూ పార్క్ నుండి అర్సపల్లి వరకు అలీ షబ్బీర్ పాదయాత్ర రోడ్ షో చేసుకుం టూ ఎన్నికల ప్రచారం నిర్వహిం చారు. 6 గ్యారెంటి స్కీములతో కాంగ్రెస్ ‘అభయ హస్తం’ఆరు పథకాలు. ప్రజల్లో తీసుకెళ్లడం ఇంటింటికి తిరుగుతూ ప్రతి దుకాణదారులను ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారితో మమేకమై వారి సమస్యలు తెలుసుకుంటూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రాగానే మీ సమస్యల్ని తీరుస్తానని అన్నారు.

హామీ ఇస్తు చేతు గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని తమ సమస్యలు పరిష్కరిం చుకోవాలని ప్రచారం చేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ..ఇక్కడ దుకాణ సముదాయాలను చూస్తుంటే ఏ ఒక్క వ్యపారి కూడా ప్రశాంతంగా వ్యాపారం చేసుకునే పరిస్థితిలో లేరన్నారు.ఎక్కడ చూసినా పార్కింగ్ సమస్య తో ప్రజలు నానా అవస్థలు పడుతూ షాపింగ్ చేసుకోవాల్సి వస్తుందనీ వాపో యారు. బిఆర్ఎస్ ప్రభుత్వం పట్ట ణంలో వ్యాపార సముదా యాలకు సరైన అభివృద్ధి చేయలేదు. ట్రాఫిక్ సమస్యలు తీర్చలేదన్నారు.వారికి దోపిడీ తప్ప వేరే ఆలోచన లేదన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement