Monday, April 29, 2024

రాజ్యాంగ వ్యతిరేకి కేసీఆర్: మందకృష్ణ మాదిగ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగ వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ప్రజాస్వామ్య వ్యతిరేక నియంత పాలన కొనసాగిస్తున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాంలు అన్నారు. శనివారం జనగామ జిల్లా కేంద్రంలోని జూబ్లీ ఫంక్షన్ హాల్ లో రాజ్యాంగ పరిరక్షణ యుద్ధభేరి సన్నాహక సమావేశం జరిగింది.  ఈ సందర్భంగా ప్రపంచంలోనే అతి గొప్ప రాజ్యాంగం ఏదైనా ఉంది అంటే అది భారత రాజ్యాంగమే అని  రాజ్యాంగాన్ని రచించిన ప్రపంచ మేధావుల్లో అతి గొప్ప మేధావి అయిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని మంద కృష్ణమాదిగ అన్నారు. ఆయన రచించిన రాజ్యాంగాన్ని అగౌరవపరిచే విధంగా నేడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పరిపాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. కెసిఆర్ నియంత పోకడలను అంతమొందించేందుకు యువత అట్టడుగు పేద బడుగు బలహీన వర్గాల మైనార్టీ ప్రజలు ఏకం కావాలని పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement