Monday, March 25, 2024

జూనియ‌ర్ ఆర్టిస్ట్ గాయ‌త్రి మృతి – న్యాయం చేయాలంటోన్న త‌ల్లి

హోలీ సంద‌ర్భంగా జూనియ‌ర్ ఆర్టిస్ట్ గాయ‌త్రి త‌న స్నేహితుడు రోహిత్ తో క‌లిసి ప్రిస‌మ్ ప‌బ్ కు వెళ్లింది. కాగా వారి కారు యాక్సిడెంట్ కి గుర‌యింది. హైద‌రాబాద్ గ‌చ్చిబౌలిలో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. కాగా గచ్చిబౌలి ఏఐజీ అసుపత్రిలో వెంటిలేటర్‌పై రోహిత్‌ చికిత్స పొందుతున్నాడు. అతి వేగంగా కారు నడపడం వల్లే ప్రమాదానికి కారణామని తమ ప్రాథమిక విచారణలో తెలిసింది. కాగా గచ్చిబౌలి ఐటీ కారిడార్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతిచెందిన విషయం తెలిసిందే. అతివేగంగా వచ్చిన వీరి కారు ఎల్లా హోటల్‌ ముందు ఫుట్‌పాత్‌ను ఢీ కొట్టి గాల్లోకి ఎగిరిపడింది. ఈ ప్రమాదంలో ఆ దగ్గర్లోనే గార్డెనింగ్‌ పనులు చేస్తున్న మహేశ్వరి(38)ని ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన రోహిత్, జూనియర్‌ ఆర్టిస్ట్‌, యూట్యూబర్‌ గాయత్రిని గచ్చిబౌలిలోని ఏఐ జీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే గాయత్రి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఫుట్‌పాత్‌ను కారు ఢీ కొట్టడంతో రెండు చక్రాలు ఊడిపడ్డాయి. కారు పల్టీ కొట్టగానే అందులోంచి గాయత్రి బయట పడిపోయినట్లుగా సీసీ పుటేజీలో పోలీసులు గుర్తించారు. మరోవైపు రోడ్డు ప్రమాదంపై గాయత్రి తల్లి స్పందించారు. తన కూతుకు అన్యాయం చేసి వెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రోహిత్‌తో కలిసి కూతురు బయటకు వెళ్లిందని తెలిపారు. న్యాయ వ్యవస్థ, పోలీసులు తమకు న్యాయం చేయాలని కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్, టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement