Saturday, May 4, 2024

Nizamabad: కలెక్టరేట్లోని ఆలయంలో దొంగ చేతివాటం..

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో ఉన్న నవదుర్గదేవి ఆలయంలో ఓ దొంగ చేతి వాటిని ప్రదర్శించాడు. ఆలయంలో దర్శనం నిమిత్తం వెళ్ళిన వ్యక్తి.. ఆలయ అర్చకుడి సెల్ఫోన్ ఎత్తుకెళ్లాడు. నిత్యం రద్దీతో ఉండే కలెక్టరేట్లోనే సెల్ ఫోన్ దొంగ చేతివాటం ప్రదర్శించడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కలెక్టరేట్ చుట్టూ పోలీసుల నిఘా వ్యవస్థ, సీసీ కెమెరాలు ఉన్నా.. దొంగ తన చేతి వాటాన్ని ప్రదర్శించడం గమనార్హం. దీంతో కలెక్టరేట్ లో నిఘా వ్యవస్థపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement