Friday, April 26, 2024

బీజేపీకి షాక్ : ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్ చేరిన బీజేపీ ఎంపీపీ

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో బీజేపీ కి షాక్ త‌గిలిన‌ట్ల‌య్యింది. ఇంద్రవెల్లి బీజేపీ పార్టీ నాయకురాలు మండల ప్రజా పరిషత్ అధ్య‌క్షురాలు (ఎంపీపీ) పొట్టే శోభ భాయ్ ఈరోజు ఎమ్మెల్యే అజ్మీరా రేఖా శ్యామ్ నాయక్ సమక్షంలో తెరాస పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ… తెరాస పార్టీ చేపడుతున్న సంక్షేమ పథకాలకు, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. తనతో పాటు సర్పంచ్ లు, 50 మంది బీజేపీ నాయకులు తెరాస‌లో చేరుతున్నట్టు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement