Wednesday, May 1, 2024

ఎల్బీనగర్ లో కాషాయ జెండా ఎగరవేయాలి – కర్ణాటక ఎమ్మెల్సీ రవికుమార్

కర్మన్ ఘాట్ ఆగస్టు 27 (ప్రభ న్యూస్) ఎల్బీనగర్ నియోజకవర్గం లో బిజెపి జెండా ఎగరవేయాలని కర్ణాటక ఎమ్మెల్సీ రవికుమార్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. హస్తినాపురం డివిజన్ పంచాయతీరాజ్ టీచర్స్ కాలనీలో ఆదివారం ప్రభాస్ యోజన కార్యక్రమంలో భాగంగా బూత్ కమిటీ సభ్యులు, శక్తి కేంద్రాలు ,ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. డివిజన్ బిజెపి అధ్యక్షుడు నరేష్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ రవికుమార్, రంగారెడ్డి అర్బన్ జిల్లా బిజెపి అధ్యక్షులు సామ రంగారెడ్డి హాజరైనారు .ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం కుటుంబ పాలనగా మారిందని రాబోయే ఎన్నికల్లో ప్రజలు టిఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని కోరారు.

ఈ కార్యక్రమంలో అర్బన్ జిల్లా ఉపాధ్యక్షులు రాజేంద్రప్రసాద్, బిజెపి కన్వీనర్ కొత్త రవీందర్ గౌడ్, నాయకులు మల్లేష్ గౌడ్, రాజు గౌడ్ ,సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement