Sunday, April 28, 2024

TS: మేడిగ‌డ్డ‌కు బ‌య‌లుదేరిన ఎమ్మెల్యేల బృందం…

మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు బస్సులో కాసేపటి క్రితం బయలుదేరి వెళ్లారు. అసెంబ్లీ వద్ద నుంచి 4 బస్సుల్లో నేతలు బయలు దేరి వెళ్లారు. మధ్యాహ్నం 3 గంటల వరకు మేడిగడ్డ వద్దకు ప్రజాప్రతినిధులు చేరుకోనున్నారు.

కాగా, మేడిగడ్డ సందర్శనకు బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు దూరంగా ఉన్నాయి. ఇక సీపీఐ, ఎంఐఎం నేతలు కాంగ్రెస్‌తో కలిసి మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు వెళ్లారు. ఇక కాంగ్రెస్ బృందం 3.30 నుంచి 5 గంటల వరకు మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనుంది. సాయంత్రం 6 గంటలకు సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement