Tuesday, May 14, 2024

kothagudem : పోడు పట్టాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వనమా.. బ్రహ్మరథం పట్టిన గిరిజనులు

కొత్తగూడెం భద్రాచలం : స్థానిక ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు గిరిజనులు పోడు పట్టాలను పంపిణీ చేశారు. ఈసందర్భంగా సుజాత నగర్ లో జరిగిన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు. పట్టాల పంపిణీ అనంతరం ఎమ్మెల్యే వనమా మాట్లాడుతూ… ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న పోడు భూముల పట్టాల సమస్యను కేసీఆర్ పరిష్కరించారంటూ వెల్లడించారు. అర్హులైన గిరిజనులందరికీ కూడా పోడు భూముల పట్టాలు అందజేస్తామని, ఎవరూ దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. అంతకు ముందు ఈ కార్యక్రమానికి భారీ ర్యాలీగా ఎమ్మెల్యే తరలివచ్చారు. ఈ ర్యాలీలో భారీగా గిరిజనులు పాల్గొని ఎమ్మెల్యేకు బ్రహ్మరథం పట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement