Saturday, May 4, 2024

MLA Sudheer Reddy – కేసీఆర్ మేనిఫెస్టోతో ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ …

కర్మన్ ఘాట్ అక్టోబర్ 17 (ప్రభ న్యూస్) రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన మేనిఫెస్టో తో ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అయిందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. చంపాపేట్ డివిజన్ పరిధిలోని బైరామల్ గూడ సీతారామ నగర్ బస్తీకి చెందిన కరాటే యాదమ్మ మరియు పలువురు మహిళలు,పురుషులు బారాస పార్టీలో చేరారు.ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ ఎల్.బి.నగర్ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న సుధీర్ రెడ్డి వారి యొక్క విధివిధానాలు నచ్చి బారాస పార్టీలోకి చేరిక కావడం జరిగింది అని తెలిపారు.రాబోయే ఎన్నికల్లో సుధీర్ రెడ్డి ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని హామీ ఇచ్చారు.

అనంతరం సుధీర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేసిన మేనిఫెస్టో ప్రత్యర్ధుల మైండ్ బ్లాక్ అయింది అని తెలిపారు.వారు విడుదల చేసిన మేనిఫెస్టో అన్ని వర్గాలవారికి సమన్యాయం జరుగుతుందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో మరోసారి ఆశీర్వదించి కారు గుర్తుకే ఓటు వేసి అసెంబ్లీకి పంపాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గజ్జల మధుసూధనరెడ్డి,కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయం చైర్మన్ నల్ల రఘుమారెడ్డి, గడ్డి అన్నారం మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సుంకోజు కృష్ణమాచారి,డివిజన్ బారాస అధ్యక్షులు ముడుపు రాజిరెడ్డి,మహిళా అధ్యక్షురాలు రోజారెడ్డి కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయం ధర్మకర్తలు గోగిరెడ్డి అంజిరెడ్డి,సురేందర్ రెడ్డి, నాయకులు సత్యప్రకాశ్,శేఖర్ రెడ్డి,మల్లేష్ గౌడ్,జగదీష్ గౌడ్,వసంత,లక్ష్మీ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement