Friday, May 3, 2024

NZB: టాస్క్ ఫోర్స్ పోలీసుల తనిఖీలు.. రూ.19లక్షల నగదు సీజ్

నిజామాబాద్ సిటీ, అక్టోబర్ 17 (ప్రభ న్యూస్): నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు.. టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడిలో భారీ నగదు పట్టుకున్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడుల్లో రూ.19లక్షల నగదును మంగళవారం సీజ్ చేశారు. సమాచారం మేరకు… సీపీ కల్మేశ్వర్ ఆదేశాలతో, టాస్క్ ఫోర్స్ ఏసీపీ, తన సిబ్బందితో నిజామాబాద్ నగరంలోని పురం చౌరస్తాలో వాహనాల తనిఖీలు చేపట్టారు.

ఓ వ్యక్తి తన ద్విచక్ర వాహనంలో రూ.19లక్షల నగదును గుర్తించి వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సదరు వ్యక్తి నగరానికి చెందిన మణికంఠగా పోలీసులు గుర్తించారు. నగదుకు సంబంధించిన సరైన పత్రాలు, ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో అతని వద్ద రూ.19లక్షల నగదు స్వాధీనం చేసుకొని విచారణ నిమిత్తం నాలుగవ టౌన్ పోలీసులకు అప్పగించారు. ఈ కార్యక్రమంలో టౌన్ సిఐ నరహరి, నాలుగవ టౌన్ ఎస్ఐ సంజయ్, టాస్క్ ఫోర్స్ పోలీసులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement