Monday, May 6, 2024

సూరారంలో అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సూరారం 129 డివిజన్ పరిధిలోని అంబేద్కర్ భవన్ వద్ద భారతరత్న డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ వర్ధంతిని పురస్కరించుకుని ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి, డివిజన్ ప్రధాన కార్యదర్శి సిద్ధిక్, నాయకులు మంత్రి అరుణ్, రవీందర్ ముదిరాజ్, పందిరి యాదగిరి, దళిత సంఘాల ఐక్య వేదిక చైర్మన్ మద్దెల సత్యనారాయణ, జనరల్ సెక్రెటరీ అశోక్, కోశాధికారి సాయి బాబా, చీఫ్ అడ్వైజర్ కిషన్ రావు, గౌరవ అధ్యక్షుడు బుచ్చన్న, వైస్ చైర్మన్ శ్యామ్, హోల్యదాసరి నర్సింహా, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్లయ్య, శ్రీనివాస్, సాయిబాబా, మహిళా నాయకురాలు అనిత, యాదమ్మ, సత్యనారాయణ, కిరణ్ కుమార్, లక్ష్మణ్, శ్రీనివాస్, సాయి, ప్రకాష్, సంతోష్, జాన్, రాజు, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement