Sunday, May 19, 2024

ఫొటోలకు పోజులు తప్ప చేసిందేమీలేదు: టీఆర్ఎస్ ఎంపీలపై రేవంత్ సెటైర్

పార్లమెంట్ సమావేశాల్లో టీఆర్ఎస్ ఎంపీలు నామమాత్రంగా నిరసనలు తెలుపుతున్నారని TPCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఫొటోలకు పోజులు తప్ప టీఆర్ఎస్ ఎంపీలు చేసిందేమీలేదని ఎద్దేవా చేశారు. పార్లమెంటులో నిరసనలు తెలుపుతున్నామని చెబుతూ తెలంగాణ ప్రజలను మభ్యపెడుతున్నారని ధ్వజమెత్తారు. రేపటి నుంచి పార్లమెంటులో టీఆర్ఎస్ ఎంపీల నిరసనలు ఉండవన్న రేవంత్.. వారు పార్లమెంటు నుంచి మాయమవబోతున్నారని పేర్కొన్నారు.

కేంద్రం నుంచి తెలంగాణ సర్కారుకు ఆదేశాలు అందడమే అందుకు కారణమని చెప్పారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి డ్రామాలు ఆడుతున్నాయని ఆరోపించారు. రైతుల ఇబ్బందులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వ చర్యలతో రైతులు ఆగమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం మెడలు వంచుతామన్న కేసీఆర్ ఫాంహౌస్ లో పడుకున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement